Thursday, April 25, 2024

202రోజులు క‌రోనాతో పోరాడి గెలిచిన మ‌హిళ‌..

క‌రోనాతో చాలా మంది ఇప్ప‌టికే మ‌ర‌ణించారు. అయితే గుజ‌రాత్ లో ఓ మ‌హిళ 202రోజులు క‌రోనాతో పోరాడి గెలిచింది. గుజరాత్ దహోద్ పట్టణానికి చెందిన గీతా ధర్మిక్ (45) మే 1న కరోనా బారిన పడింది. ఆమె భర్త రైల్వే ఉద్యోగి కావడంతో సమీపంలోని రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. అంతకు ముందు ఏప్రిల్ 23న తన మామ గుండె పోటులో చనిపోతే భోపాల్ వెళ్లామని .. అక్కడే కరోనా ఎటాక్ అయిందని.. గీతకు కరోనా లక్షణాలు కనిపించాయని భర్త త్రిలోక్ ధార్మిక్ తెలిపారు. పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చిందని పాజిటివ్ తేలిందన్నారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. దాదాపుగా 202 రోజులు మహమ్మారి తో పోరాడి విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement