Wednesday, April 24, 2024

థర్డ్ వేవ్ వచ్చేసినట్లేనా..? ఇండియాలో మరోసారి 45,083 కేసులు

దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 45,083 కొత్త కేసులు న‌మోదైయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో ప్రకారం దేశంలో ఇప్పటి వ‌ర‌కు 3,26,95,903 కేసులు న‌మోద‌వ్వగా, ఇందులో 3,18,88,642 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,68,558 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,37,830 కి చేరింది. ఇక 24 గంట‌ల్లో ఇండియాలో 35,840 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది.

ఇది కూడా చదవండి: ఏడేళ్లలో దళితులకు ఏం చేశారు ?: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ప్రవీణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement