Monday, March 18, 2024

జిహెచ్ఎంసిలో పెరిగిన కరోనా.. రెండు జిల్లాల్లో జీరో కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు నిర్వహించగా, 582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 638 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,35,250 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 8,744 యాక్టివ్ కేసులు ఉన్నాయి మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,817కి చేరింది.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 61 కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 45 కేసులు గుర్తించారు. కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement