Thursday, March 28, 2024

తెలంగాణలో కొత్తగా 1,511 కేసులు..

తెలంగాణలో కరోనా మరింతగా తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల నమోదు కాగా, రికవరీ రేటు 96.03 శాతానికి పెరిగింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, రోజువారీ కేసుల విషయానికొస్తే… 1,10,681 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,511 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 12 మరణాలు సంభవించాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,496కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,04,880కి చేరింది. ఇప్పటిదాకా 5,80,923 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,461 మందికి చికిత్స జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement