Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 3 లక్షల కేసులు..4 వేల మంది మృతి..

భార‌త్‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. నిన్న‌ కొత్త‌గా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న 3,62,437 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,46,84,077కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,077 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,70,284కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,04,32,898 మంది కోలుకున్నారు. 36,18,458     మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,22,20,164  మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 31,48,50,143 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న 18,32,950 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement