Thursday, March 28, 2024

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీ రేటు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,054 మంది సాంపిల్స్ పరీక్షించగా.. 1,010 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1149 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. మరో 13 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2050324కి చేరగా.. ఇందులో 2024645 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో 14,176 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: జనసేనానికి షాక్.. పవన్ శ్రమదానానికి నో పర్మిషన్!

Advertisement

తాజా వార్తలు

Advertisement