Thursday, March 28, 2024

ఏపీలో భారీగా క‌రోనా కేసులు.. కొత్తగా 1627 మందికి వైరస్

ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది.  గ‌డిచిన 24గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,672 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా… 1627మందికి వైర‌స్ ఉన్న‌ట్లు తేలింది. చికిత్స పొందుతూ మ‌రో 2,017మంది కోలుకోగా, 17మంది మ‌ర‌ణించారు. కరోన మృతులు 13, 273 కు చేరింది. మొత్తం 19.21 లక్షల మంది రికవరీ అయ్యారు (98.1%).  వైరస్ బారిన పడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు.. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement