Thursday, March 28, 2024

దేశంలో కరోనా ప్రళయం..ఒక్క రోజే 2 వేల మంది మృతి

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,62,63,695కు పెరగ్గా.. ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకున్నారు.

ఇక తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త గా 6,206 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో  3,052 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,494కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,24,840 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,928 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 52,726 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కేసులు భారీగా నమోదు అవుతుండడంతో స్పెషల్ కంటోన్మెంట్ జోన్ల వారీగా విభజించి అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement