Friday, March 29, 2024

దేశ వ్యాప్తంగా మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఒక్క‌రోజే 17వేల‌కు పేగా న‌మోదు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 17,073 మంది వైరస్​ బారినపడగా.. మరో 21 మంది చ‌నిపోయారు. కరోనా నుంచి 15,208 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 43,407,046 ఉండ‌గా.. ఇందులో మరణాలు 5,25,020, యాక్టివ్​ కేసులు 94,420.. ఉన్నాయి. దీంట్లో కోలుకున్నవారి సంఖ్య 4,27,87,606 గా ఉంది..

ఇక దేశంలో ఆదివారం 2,49,646 మందికి టీకాలు అందించిన‌ట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య‌శాఖ తెలిపింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,11,91,329 కోట్లకు చేరింది. మరో 3,03,604 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement