దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 17,073 మంది వైరస్ బారినపడగా.. మరో 21 మంది చనిపోయారు. కరోనా నుంచి 15,208 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 43,407,046 ఉండగా.. ఇందులో మరణాలు 5,25,020, యాక్టివ్ కేసులు 94,420.. ఉన్నాయి. దీంట్లో కోలుకున్నవారి సంఖ్య 4,27,87,606 గా ఉంది..
ఇక దేశంలో ఆదివారం 2,49,646 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,11,91,329 కోట్లకు చేరింది. మరో 3,03,604 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.