Friday, April 26, 2024

ర‌ష్యాలో విజృంభిస్తోన్న క‌రోనా..మృత‌దేహాల‌తో నిండుతోన్న శ్మ‌శాన వాటిక‌లు..

క‌రోనా సృష్టించిన బీభ‌త్సం అంతా ఇంతా కాదు..ఇప్ప‌టికీ ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు..థ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా ఉంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా క‌రోనా కేసులు యూర‌ప్ దేశాల‌తో పాటు ర‌ష్యాల్లో కూడా ఎక్కువ‌గా న‌మోదు కావ‌డం క‌ల‌వ‌రం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం రష్యాలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఆదేశంలో స్మశాన వాటికలన్నీ కరోనాతో మరణించిన మృత‌దేహాల‌తో నిండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,156 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆదేశంలో కరోనా కేసుల సంఖ్య 9,257,068కి చేరింది. రాష్యాలోని 85 ప్రాంతాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. గురువారం రికార్డు స్థాయిలో ఒక్కరోజే 1,251 మంది మరణించారని రష్యా కొవిడ్ టాస్క్​ఫోర్స్ వెల్లడించింది. రష్యాలో ఒకరోజు సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం. ప్రపంచంలో కోవిడ్ టీకాను మొదటిసారిగా ఉత్పత్తి చేసిన రష్యా.. ఆదేశ ప్రజలకు దాదాపుగా అందరికీ టీకాలు అందించింది. అయినా పెరుగుతున్న కేసులు ఆదేశాన్ని ఆందోళన పరుస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement