Tuesday, April 23, 2024

HYD: భార్యను హత్య చేసిన కానిస్టేబుల్

ఓ కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం గౌతమీనగర్ లో శుక్రవారం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ రాజ్ కుమార్ కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి ఫస్ట్‌ఫ్లోర్ నుండి కింద పడేశాడు. రాజ్ కుమార్ హైకోర్టు నాలుగో గేటు వద్ద విధులు నిర్వహిస్తుంటాడు. భార్యతో కలిసి వనస్థలిపురం గౌతమీనగర్ లో రాజ్ కుమార్ నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహలతో భార్య శోభను రాజ్ కుమార్ హత్య చేశాడు. భార్య గొంతుకోసి ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement