Thursday, April 18, 2024

పంజాబ్ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు

కేంద్రం సూచనలతో పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రో ధరలు తగ్గించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా పంజాబ్ కూడా చేరింది. పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించింది. పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తాజా ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

గత 20 ఏళ్లలో పంజాబ్ లో చమురు ధరలు తగ్గడం ఇదే ప్రథమం. సర్కార్ పన్నుల తగ్గింపు నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ.900 కోట్ల మేర భారం పడనుంది. ప్రభుత్వం నిర్ణయంతో పంజాబ్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.16, డీజిల్ లీటరుకు రూ. 84.80 లభించనుంది.

కాగా, ఇటీవలే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం… వినియోగదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించారు. ఇతర రాష్ట్రాల్లోనూ చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణయంతో ఇతర రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పంజాబ్ చమరు ధరలపై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement