Friday, March 29, 2024

వెల్ డన్ మోదీ జీ: కాంగ్రెస్

అదేంటి రాజకీయాలన్నాక అధికారం పక్షంపై ప్రతిపక్షం ఎప్పుడూ విమర్శలు చేస్తుండాలి కదా.. మరీ కాంగ్రెస్ ఏంటీ ప్రధాని మోడీ ని పొగుడుతోంది అనుకుంటున్నారా..? అవును ప్రధాని మోదీ ప్రశంసించారు కాని అంతకన్న ఎక్కువ రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఆ క్రెడిట్ ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ, 10 తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. వెల్ డన్ మోదీ జీ. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సలహాను పాటించారు. దేశ హితం కోసం తాము ఎంత దూరమైనా వెళ్తాం. దేశ ప్రజల ఉన్నతి కోసం కలిసి పని చేయడం మా ప్రజాస్వామిక విధి. అహాన్ని పక్కన పెట్టి దేశానికి ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషకరం అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇదే నిర్ణయాన్ని 12వ తరగతికి కూడా అమలు చేయాలని కోరారు. విద్యార్థులను జూన్ వరకు ఒత్తిడిలో ఉంచడం సరికాదని అన్నారు సోనియా గాంధీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement