Saturday, April 20, 2024

మ‌న్మ‌థుడిలా ఎంపీ .. మ‌హిళా ఎంపీల‌తో సెల్ఫీ .. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌ ..

నిత్యం వార్త‌ల్లో నిల‌వ‌డం ప‌లువురికి స‌ర‌దా.. అదే కోవ‌లో ఉంటారు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ కూడా.. తోటి ఎంపీల‌తో ఆయ‌న క‌లిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సెల్ఫీ దిగ‌డం వ‌ర‌కు ఓకే కానీ ఆ ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో పెద్ద దుమార‌మే రేగుతుంది. అంతేనా లోక్ స‌భ అంద‌మైన ప్ర‌దేశం కాదా అనే క్యాప్ష‌న్ పెట్ట‌డం విశేషం. ఈ ఫోటోలో శశిథరూర్ తో పాటు.. మహిళా ఎంపీలంతా.. పార్టీలతో సంబంధం లేకుండా.. సరదాగా నవ్వుతూ కనిపించడం విశేషం. ఈ ఫోటోలో తృణమూల్‌కు చెందిన నుస్రత్ జహాన్ , మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి ,తమిజాచి తంగపాండియా లు శశిథరూర్ తో కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చారు..

దాంతో శ‌శిథ‌రూర్ కి ఆడ‌వాళ్లంటే మ‌హా పిచ్చ‌ని ..ఆయ‌నో ఉమ‌నైజ‌ర్ అని ట్రోల్స్ మొద‌లు పెట్టారు నెటిజ‌న్స్ .. ఈ సెల్ఫీపై బిజెపి నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దాంతో శ‌శిథ‌రూర్ మ‌రో ట్వీట్ చేశారు. ఈ సెల్ఫీ (మహిళా ఎంపీల చొరవతో) చాలా సరదాగా తీసుకున్నాం. అదే స్ఫూర్తితో ట్వీట్ చేయమని వారే నన్ను అడిగారు. కానీ.. ఈ ట్వీట్ విషయంలో కొందరు నన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫోటో షేర్ చేసినందుకు మాత్రం నేను సంతోషంగా ఉన్నాన‌ని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement