Thursday, March 28, 2024

కరోనా థర్డ్ వేవ్‌కు సిద్ధం కావాలి: రేవంత్ రెడ్డి

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌లో పలువురు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ముంచుకువస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్‌లో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

★ తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి
★ చిన్నారులకు అందించే వైద్య సదుపాయాలను ప్రభుత్వాలు పెంచాలి
★ నర్సింగ్ స్టాఫ్‌ను పెంచాలి, వారికి సరైన రీతిలో శిక్షణ ఇవ్వాలి
★ చిన్నారుల భవితవ్యాన్ని కాపాడేందుకు మెడికల్ సదుపాయాలను మరింత మెరుగుపరచాలి

Advertisement

తాజా వార్తలు

Advertisement