Friday, March 29, 2024

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ఉత్తమ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఆయన మాట్లాడుతూ… అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తే.. నవంబర్ లో ఎన్నికలుంటాయన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. కేసీఆర్ అసమర్ధత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అన్నారు.

ప్రభుత్వ యూనివర్సిటీలో కనీస వసతులు లేవని, సిబ్బంది లేరన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలు వస్తాయనే యువత తెలంగాణ కోసం పోరాడారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్.. ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement