Wednesday, April 24, 2024

దేశ ప్రగతిని నాశనం చేసిన కాంగ్రెస్.. ప్రధాని మోడీ

దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతికి ధన్యవాద తీర్మాణంపై ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఆలోచన విపక్షాలకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సభలో ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు. తమ ఆలోచనంతా డెవలప్ మెంట్ పైనే అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతుండగా ఆదానీ అంశంపై ప్రధాని మోడీ మాట్లాడాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఆదానీ వ్యవహారంపై జేఏసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని మోడీ ప్రసంగించారు. సభలో విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement