Monday, March 25, 2024

హిమాచల్ లో బీజేపీకి షాక్.. కాంగ్రెస్ క్లిన్ స్వీప్

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. బీజేపీ పోటీ చేసిన అన్ని సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేసింది. మండి లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ప్ర‌తిభా సింగ్‌.. బీజేపీ అభ్య‌ర్థి కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు ప‌ది వేల ఓట్ల తేడాతో బ్రిగేడియ‌ర్ కుషాల్ ఓట‌మి పాల‌య్యారు. ఫ‌తేపూర్‌, ఆర్కీ, జుబ్బ‌ల్ అసెంబ్లీ స్థానాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకున్న‌ది. ఫ‌తేపూర్ నుంచి భ‌వానీ సింగ్‌, ఆర్కీ నుంచి సంజ‌య్‌, జుబ్బ‌ల్ నుంచి రోహిత్ ఠాకూర్‌లు గెలుపొందారు. వరుస ఓటమములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు ఊరటనిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement