Thursday, March 28, 2024

Breaking: మందుబాబుల దాడిలో కండక్టర్ మృతి : సాయం ప్రకటించిన సీఎం

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ బస్సులో మందుబాబులు చేసిన దాడిలో కండక్టర్ చనిపోయాడు. టికెట్ తీసుకోవాలన్న కండక్టర్‌పై తాగుబోతులు దాడి చేశారు. దీంతో కండక్టర్ పెరుమాళ్ పిళ్లై మృతి చెందాడు. చెన్నై నుంచి విల్లుపురం వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కండక్టర్ పెరుమాళ్ పిళ్లై కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement