Wednesday, April 24, 2024

ఆఫీసుకి రండి కంపెనీ ఆదేశాలు – జాబ్ కి రిజైన్ చేసిన టెకీ -కోట్ల రూపాయ‌ల్లో అత‌ని శాల‌రీ

క‌రోనా నేప‌థ్యంలో ప‌లు కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంల‌ను అందుబాటులోకి తెచ్చాయి. కరోనా తీవ్రత తగ్గిపోయిన నేపథ్యంలో ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ యాపిల్ కంపెనీ తన ఉద్యోగులకు చెప్పిన నేపథ్యంలో.. ‘గుడ్ ఫెలో’ అనే టెకీ తన జాబ్ కు రిజైన్ చేసి అందరిని విస్మయానికి గురి చేశాడు. యాపిల్ లో అతగాడి జీతం గురించి అధికారికంగా తెలియకున్నా.. అనధికారికంగా మాత్రం ఏడాదికి రూ.6 – రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. యాపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అతగాడు.. హైబ్రిడ్ వర్క్ పాలసీకి వ్యతిరేకిస్తూ తన జాబ్ ను వదులుకున్నాడు. తన టీంలో పని చేసేవారికి మరింత వెసులుబాటు ఉండేలా నిర్ణయాలు ఉంటేనే.. ప్రొడక్టివిటీ బాగుంటుందని తాను నమ్ముతానని అతను వాదిస్తున్నాడు. అందుకే.. తాను యాపిల్ ను వీడుతున్నట్లుగా స్పష్టం చేశాడు. మే 23 నుంచి ఉద్యోగుల్ని వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఉద్యోగుల్ని స్పష్టం చేసింది. ఇతగాడి నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. యాపిల్ కంపెనీ తాజాగా ఇంటి నుంచి పని చేస్తున్న తన ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఉద్యోగుల్ని కోరగా.. ఈ పాలసీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులు రాజీనామా బాట పట్టటం ఇప్పుడా కంపనీ టాప్ మేనేజ్ మెంట్ కు ఇప్పుడీ అంశం ఒక పట్టాన కొరుకుడుపడటం లేదని చెప్పక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement