Wednesday, April 24, 2024

Hyderabad: బయోటెక్​ ఫ్యూచర్​ ఫోరం సదస్సు రండి, మీ సలహాలు చెప్పాలే.. మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి ఆహ్వానం అందింది. సెర్బియాలో అక్టోబర్ 20వ తేదీన నిర్వహించే బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌కు సెర్బియా ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం పంపించింది.

కాగా, హెల్త్ కేర్, లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌ను మంత్రి కేటీఆర్ తీర్చిదిద్దుతున్నారని వారు ఆ లేఖలో ప్రశంసించారు. తెలంగాణ విధానాలు, అనుభవాలు సదస్సులో వివరించాలని కోరారు. ఈ క్రమంలో బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు తనను ఆహ్వానించిన సెర్బియా ప్రధాని Ms. Ana Brnabić, ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు @borgebrendeకు మంత్రి  కేటీఆర్ ట్విట్టర్​ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement