Sunday, March 24, 2024

Invitation | నా పెళ్లికి రండి.. ఎంపీ సంతోష్​కు శర్వా ఆహ్వానం

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ఓ ఇంటివాడవుతున్నాడు. శర్వానంద్ వివాహాం రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో జూన్ 3వ తేదీన జేష్ట్య మాసం పౌర్ణమి రోజున పండితులు నిర్ణయించిన ముహూర్తాన పెళ్లి జరగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి నందమూరి, మెగా (కొణిదెల), అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని, ఉప్పలపాటి ఫ్యామిలీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, తన పెళ్లికి రావాలని శర్వానంద్​ ఇవ్వాల (మంగళవారం) ప్రగతి భవన్​లో ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమర్​ను కలిసి ఆహ్వానించారు.

ఇక.. శర్వానంద్​ వివాహం రెండు రోజులు గ్రాండ్‌గా జరగనున్నట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు మెహందీ కార్యక్రమాలతో పాటు.. పెళ్లికొడుకును చేసే తతంగం ఉంటుంది. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షితారెడ్డి. ఈమె ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని శర్వా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక శర్వానంద్, రక్షిత వివాహా నిశ్చయ తాంబూలాలు ఇరు కుటుంబాల సన్నిహితులు, మిత్రలు మధ్య జనవరిలో జరిగింది. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే రక్షితా రెడ్ది తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అంటున్నారు. అంతేకాదు ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు కూడా అవుతుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement