Friday, April 19, 2024

Jharkhand: కుప్పకూలిన బొగ్గు గని: ముగ్గురు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ సమీపంలోని బొగ్గుగని కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు బొగ్గు గనిలో చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ బొగ్గుగనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తుంది. అనుమతి లేకుండా ఈ బొగ్గు గని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

బొగ్గు వెలికితీతకు స్థానికంగా ఉన్న గ్రామస్తులను బొగ్గు మైనింగ్ నిర్వహిస్తున్న సంస్థ నియమించుకుందని సింధ్రీ డీఎస్పీ అభిషేక్ కుమార్ చెప్పారు. శిథిలాల నుండి స్థానికులు ముగ్గురిని బయటకు తీసి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందారని వైద్యులు ప్రకటించారని డీఎస్పీ చెప్పారు.ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement