దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని తెలిపింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ను ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరెంట్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్ కోతలుఅమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్’నువాడుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం రేట్లు ఇవే..