Thursday, April 25, 2024

అడివిశేషుని కొనియాడిన సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే-మేజ‌ర్ టీంకి ప్ర‌శంస‌లు

హీరో అడివిశేషు న‌టించిన తాజా చిత్రం మేజ‌ర్.ఈ చిత్రంపై సెల‌బ్రిటీలు..రాజ‌కీయనాయ‌కులు ప్ర‌శంస‌ల జ‌ల్లుని కురిపిస్తున్నారు. కాగా సైనిక వీరుల త్యాగనిరతికి నిదర్శనంగా నిలిచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా మేజ‌ర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబయి మారణహోమంలో సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందారు. ఇప్పుడాయన కథతో వచ్చిన మేజర్ చిత్రానికి దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించారు. అడివి శేష్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అభినందించారు. ముంబయిలో మేజర్ టీమ్ సీఎం ఉద్ధవ్ థాకరేను కలిసింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశం గర్వించే సినిమా తీశారంటూ అడివి శేష్ ను కొనియాడారు. ఈ మేరకు అడివి శేష్ కు ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement