Monday, April 22, 2024

మా ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకున్న మోడీ స‌ర్కార్-సీఎం పిన‌ర‌యి ఆరోప‌ణ‌

త‌మ ప్ర‌భుత్వాన్ని మోడీ స‌ర్కార్ ల‌క్ష్యంగా చేసుకుంద‌ని ఆరోపించారు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌యన్. కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్బీ) నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను కేరళ ప్రజలు సహించరని అన్నారు. కేఐఐఎఫ్బీ ఆర్థిక కార్యకలాపాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ ఇటీవల రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్ కు నోటీసులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement