Friday, April 26, 2024

ప్ర‌జాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న బిజెపి ఆర్డినెన్స్ .. సీఎం కేజ్రీవాల్

హైదరాబాద్ – ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వ‌ల్ల ప్ర‌జాస్వామ్యానికి విఘాతం క‌లుగుతుందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కేంద్రం తీరు వల్ల ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని అన్నారు. ప్రగతి భవన్‌లో నేడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, మాట్లాడుతూ .. కొన్ని శాఖల కార్యదర్శులను సైతం బదిలీ చేసే పరిస్థితి లేదని కేజ్రీవాల్ తెలిపారు. సుప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా ప్రధాని మోడీ ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆరోపించారు.

  ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానకరమని.. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మద్ధతుతో తమకు అండ పెరిగిందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని.. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ తీరుతో దేశం ప్రమాదకరస్థితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2015లో తాము అధికారంలోకి వచ్చిన 3 నెలలకు మా నుంచి కేంద్రం అధికారాలు లాక్కుందని కేజ్రీవాల్ తెలిపారు.  ఈ విష‌యంలో సీఎం కేసీఆర్ త‌మ‌కి సంపూర్ణ మ‌ద్ద‌తుని ప్ర‌క‌టించార‌ని మీడియాకి తెలిపారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న‌ప్పుడు అన్ని అధికారాలు ఆమెకి ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్రధాని మోడీ నోటిఫికేష‌న్ తెచ్చార‌న్నారు. త‌మ విష‌యం మొత్తం కేసీఆర్ కి చెప్పామ‌న్నారు కేజ్రీవాల్. బిజెపి చేస్తోన్న కుట్ర‌ల‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement