Wednesday, April 24, 2024

బీజేపీలో చేతిలో టీఆర్ఎస్ అవినీతి చిట్టా.. కేసీఆర్‌ను జైలుకు పంపుతాం

సీఎం కేసీఆర్ తలకిందులుగా నిలబడినా హుజురాబాద్‌లో గెలవలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. మార్పు కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి చిట్టా తీశామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని చెప్పారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. కేంద్ర వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్‌కు జైలు అంటే భయం.. అందుకే కూల్చేస్తున్నారని బండి విమర్శించారు. 

ఇదీ చదవండి: తెలంగాణలో ఇక నో లాక్ డౌన్

Advertisement

తాజా వార్తలు

Advertisement