Saturday, March 23, 2024

CM KCR : నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో పూజ కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, నేతలు పాల్గొన్నారు. అలాగే నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement