Monday, March 25, 2024

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్… తిరుకల్యాణోత్సవానికి హాజరు

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీరామ అలంకార సేవలో భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ, తిరుకల్యాణ మహోత్సవం జరుగనున్నాయి. తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్‌ దంపతులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సమర్పించనున్నారు. అలాగే యాదాద్రి ఆలయ బంగారు తాపడం కోసం తమ కుటుంబం తరఫున సీఎం కేసీఆర్ 1.16 కిలోల బంగారాన్ని అందజేయనున్నారు. 

మరోవైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. మార్చి 21 నుంచి 28వరకు జరిగే కార్యక్రమాల కోసం 75 ఎకరాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి. మార్చి 28 వరకు బాలాలయంలో స్వామివారి దర్శనాలు కొనసాగించి.. అనంతరం కవచమూర్తులను ప్రధానాలయానికి తరలించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక బాలాలయాన్ని మూసివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement