Thursday, April 25, 2024

యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బ‌య‌ల్దేరి యాదాద్రికి చేరుకున్నారు. కాసేప‌ట్లో యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ తన కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. అలాగే బాలాలయం ఆవరణలో ‘కళావేదిక’కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి హైదరాబాద్‌కు బయల్దేర‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement