Tuesday, April 23, 2024

TS | మంచిర్యాల‌లో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును సీఎం కేసీఆర్ ఇవ్వాల (శుక్రవారం) ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్స‌వానికి ముందు ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి, రిబ్బ‌న్ క‌ట్ చేసి, కార్యాల‌యంలోకి సీఎం కేసీఆర్ ప్ర‌వేశించారు. ఈ పార్టీ కార్యాల‌యాన్ని రూ. 60 ల‌క్ష‌ల‌తో నిర్మించారు. పార్టీ ఆఫీసు వ‌ద్ద‌కు చేరుకున్న కేసీఆర్‌కు మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

కార్య‌క్ర‌మంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, దుర్గం చిన్న‌య్య‌, దివాక‌ర్ రావు, జోగు రామ‌న్న‌, రేఖా నాయ‌క్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement