Friday, April 26, 2024

ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.

ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా, జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement