Wednesday, April 24, 2024

తెలంగాణలో మరోసారి జ్వర సర్వే

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గింది. అయితే, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమేసేందుకు మరోసారి జ్వరసర్వే నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో నిర్వహించిన జ్వరసర్వేతో వైరస్‌ను ముందుగానే కట్టడి చేయగలిగామని, ఇప్పటికీ వైరస్‌ ప్రభావం ఉన్న కొద్దిపాటి ప్రాంతాల్లో మరోసారి సర్వే నిర్వహించాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రగతిభవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి ఇప్పటికీ సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా అంతుచిక్కని సమస్యగా మారిందని, దాన్ని కట్టడి చేయటంపై ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైందని పేర్కొన్నారు. ‘ఏ వేరియంట్‌, ఏ వేవ్‌, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంతవరకు విస్తరిస్తదో తెలుస్తలేదు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అయితది. కరోనా రోగ కారణం, దాని లక్షణం మొత్తంగా కరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి ఉన్నది. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలి. కరోనా నియంత్రణకు నూతన మార్గాలను అనుసరించాలె. కొత్త వేరియంట్ల పేరుతో వేవ్‌ల రూపంలో దశలవారీగా వస్తున్న కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ప్రజలను కరోనా బారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలి’ అని సీఎం స్పష్టంచేశారు.

మన సరిహద్దు రాష్ర్టాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కరోనా ప్రమాదం పొంచే ఉన్నదని తెలిపారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను లోతుగా పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు.. రేవంత్ పై హరీష్ సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement