Friday, April 19, 2024

శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కరీంనగర్ కు చెందిన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీభాష్యం విజయసారథి సాహితీ సేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారన్నారు. వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement