Saturday, April 20, 2024

రోడ్ల మరమ్మతులపై ఏపీ సర్కార్ దృష్టి

ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గొలు పెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాలు తగ్గాక ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్షించిన సీఎం.. పలు కీలక సూచనలు చేశారు. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగు చేయాలన్నారు. వర్షాల వల్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయన్న సీఎం జగన్.. రోడ్ల బాగు కోసం ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని వెల్లడించారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే చాలావరకు టెండర్లు పిలిచారని.. ఎక్కడైనా ఇంకా పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అక్టోబరులో రోడ్ల పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రోడ్ల పనులు చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యాచరణ వేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: గణనాథుడి చుట్టూ ఏపీ పాలిటిక్స్ !

Advertisement

తాజా వార్తలు

Advertisement