Thursday, April 25, 2024

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం.. సీఎం జగన్ ఏమన్నారంటే..

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాల్లో అధికార వైసిపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement