Thursday, April 18, 2024

సీఎం జ‌గ‌న్ తో భేటీ అయిన సినీ ప్ర‌ముఖులు

గ‌త ఆరు నెల‌లుగా టాలీవుడ్ లో ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. సినిమా టిక్కెట్ల‌పై ర‌చ్చ జ‌రుగుతోంది. కాగా నేడు ఏపీ సీఎం జ‌గ‌న్ తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. . ఈ స‌మావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్‌, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయ‌ణ మూర్తి ఉన్నారు. నాగార్జున‌ ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేద‌ట‌. సినీ ప్ర‌ముఖుల‌ను తాడేప‌ల్లి సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద ప్ర‌భుత్వ అధికారులు సాద‌రంగా ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో ముఖ్యంగా జీవో నంబ‌రు 35లో స‌వ‌ర‌ణ‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. అలాగే, థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌, వాటిల్లో స్నాక్స్ అమ్మ‌కాల ధ‌ర‌లు వంటి అంశాల‌పై కూడా చ‌ర్చిస్తారు. ఈ స‌మావేశం అనంత‌రం సీఎంవో నుంచే ఓ ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని చిరంజీవి మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement