Thursday, April 25, 2024

జైలులో ఖైదీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ – 51మంది మృతి-30మందికి గాయాలు

ఓ జైలులో ఖైదీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ఈ ఘ‌ట‌న‌లో 51మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న నైరుతి కొలబియాలోని తులువా జైలులో చోటుచేసుకుంది. మరో 30 మంది గాయపడ్డారు. జైలులో ఖైదీల మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపడానికి గార్డులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్‌లో 180 మంది ఉన్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement