Friday, March 29, 2024

గోరెటి వెంక‌న్న‌ను స‌న్మానించిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

ప్ర‌ముఖ క‌వి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను గోరెటి వెంక‌న్న క‌లిశారు. ఈరోజు సాయంత్రం గోరెటి వెంక‌న్న కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డును అందుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను వెంక‌న్న మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు వ‌రించిన గోరెటి వెంక‌న్న‌ను ఎన్వీ ర‌మ‌ణ అభినందించి, శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సీజేఐకి వెంక‌న్న వ‌ల్లంకి తాళం క‌వితా సంపుటిని బ‌హుక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎన్వీ ర‌మ‌ణ అభ్య‌ర్థ‌న మేర‌కు వెంక‌న్న అడ‌వి త‌ల్లిపై పాట‌ను పాడి వినిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement