Thursday, April 25, 2024

‘పుష్ప’ను వీక్షించిన మెగాస్టార్.. సుకుమార్ కు చిరు అభినందనలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 17న విడులైన ఈ మూవీ.. భారీ కలెక్షన్లు వసూలు చేసింది.

తాజాగా ‘పుష్ప’ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ విషయాన్ని ‘పుష్ప’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో వెల్లడించింది. ‘పుష్ప ది రైజ్’ చిత్రంలోని ప్రతి ఘట్టాన్ని చిరంజీవి ఎంతో ఆస్వాదించారని తెలిపింది. దర్శకుడు సుకుమార్ ను అభినందించారని, బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారంటూ చెప్పారని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement