Friday, April 26, 2024

గెట్ వెల్ సూన్: వెంకయ్యపై చిరు ట్వీట్

కరోనా బారిన పడిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు క‌రోనా నుంచి వేగంగా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. గెట్ వెల్ సూన్ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా, ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నానని వెంక‌య్య నాయుడు తెలిపారు. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంద‌రూ క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement