Friday, March 29, 2024

తెలంగాణ సీఎస్ కు చిరంజీవి అభినందనలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శాంతికుమారి నియమితులైన సంగ‌తి తెలిసిందే. అయితే తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన శాంతికుమారికి టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు చిరంజీవి ట్వీట్ చేశారు. శాంతికుమారి చిత్త‌శుద్ధి తెలంగాణ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని మెగాస్టార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ‌కు తొలి మ‌హిళా సీఎస్‌గా శాంతికుమారి నియామ‌కం కావ‌డం సంతోషంగా ఉంద‌ని చిరంజీవి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement