Thursday, April 18, 2024

పద్మ అవార్డు విజేతలకు అభినందనలు తెలిపిన చిరంజీవి

73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ను పురస్కరించుకొని ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులని మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అవార్డులు ద‌క్కిన వారిలో మన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఉన్నారు. పద్మ అవార్డులు దక్కిన అంద‌రికీ అభినందనలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మ అవార్డులు దక్కిన వారికి తనదైన శైలిలో ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.


మెగాస్టార్ ఈ ట్వీట్ లో.. ”పద్మ అవార్డులు పొందిన విజేతలందరికీ నా శుభాభినందనలు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ప్రముఖులు గరికపాటి నరసింహారావు, శ్రీమతి షావుకారు జానకి, శ్రీమతి పద్మజ రెడ్డి, మొగిలయ్య, శ్రీ షేక్ హాసన్, సుంకర ఆది నారాయణ, కృష్ణ సుచిత్ర ఎల్లా, నా మిత్రుడు గులాంనబీ ఆజాద్, సింగర్ సోనూనిగమ్ కు, భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గురింపు తెచ్చిన సత్య నాదెళ్ల, సుందర్ పిచయ్ లు ఉండటం మరింత సంతోషం. వీరికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement