Saturday, April 20, 2024

China: రన్ వేపై విమానంలో మంటలు.. 122 మంది ప్రయాణికులకు..

చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ కు విమానం సిద్ధమైన సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 122 మంది ఉన్నారు. టిబెట్‌కు వెళ్లే విమానంలో 113 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. విమానంలో ఉన్న వ్యక్తులందరినీ ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది… ప్రయాణికులను విమాన సిబ్బందిని అత్యవసర మార్గాల గుండా కిందకు దించారు. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

https://twitter.com/baoshitie1/status/1524578661386506240
Advertisement

తాజా వార్తలు

Advertisement