Friday, April 19, 2024

Gun Violence: చికాగోలో కాల్పుల మోత.. 8 మంది మృతి..16 మందికి గాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. చికాగోలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్‌ కిల్‌ప్యాట్రిక్‌, బ్రైటన్‌ పార్క్‌, సౌట్‌ ఇండియానా, నార్త్‌ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్‌ పార్క్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మృతుల్లో 69 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌తో పాటు 62 ఏళ్ల మహిళతో సహా అన్ని వయసుల వారు ఉన్నారు. బ్రైటన్ పార్క్, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జీ అవెన్యూ, హంబోల్ట్ పార్క్ మొదలైన పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement