Thursday, April 25, 2024

చెన్నై పగ్గాలు జడేజాకే! ధోనీ కంటే ఎక్కువ ధర.. రూ.16 కోట్లు పలికిన జడ్డూ

న్యూఢిల్లి : కెప్టెన్‌ మహీతో పాటు ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా, మోయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌లను సీఎస్‌కే అంటిపెట్టుకుని ఉంది. ఫస్ట్‌ స్లాబ్‌ ప్లేయర్‌గా జడేజాను రిటైన్‌ చేసుకోవడంతో అతనికి రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కగా.. ధోనీకి రూ.12 కోట్లే దక్కాయి. ధోనీని కాదని జడేజాకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ధోనీ రిటైర్మెంట్‌ తరువాత.. సీఎస్‌కే జట్టును జడేజా నడిపంచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ధోనీ రిటైర్మెంట్‌ తరువాత.. చెన్నై పగ్గాలను జడేజాకే అప్పగిస్తాడని అందరూ అనుకుంటున్నారు. జడేజాకు లైన్‌ క్లియర్‌ చేస్తూ.. తనకు తానే రెండో ప్రాధాన్యత ఆటగాడిగా కొనసాగాలని ధోనీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చెన్నై జట్టు తరువాతి కెప్టెన్‌ కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు జడేజాకే ఉన్నాయని పలువురు చెబుతున్నారు. చెన్నై పగ్గాలు తీసుకోవడం కూడా జడేజాకు ఇష్టం. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement