Wednesday, April 17, 2024

నడిరోడ్డుపై చిరుత .. జనాలపై దాడి.. పలువురికి తీవ్ర గాయాలు

నడి రోడ్డుపై చిరుతపులి హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన క‌ర్ణాట‌క‌లోని మైసూరులో చోటు చేసుకుంది. క‌న‌కా న‌గ‌ర్‌లోకి ప్ర‌వేశించిన చిరుత న‌డిరోడ్డుపై హ‌ల్ చ‌ల్ చేసింది. జ‌నాల‌పై దాడి చేసి ప‌లువురిని తీవ్రంగా గాయ‌ప‌రిచింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు జ‌నాలు భ‌య‌ప‌డ్డారు. స్థానికులు అందించిన స‌మాచారంతో క‌న‌కా న‌గ‌ర్‌కు అట‌వీ శాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అనంత‌రం చిరుత పులిని అధికారులు బంధించారు. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక వాహ‌నంలో చిరుత‌ను త‌ర‌లించి, అడ‌విలో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement