Thursday, April 25, 2024

చార్మినార్ నైట్ బ‌జార్ లో – స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి

రంజాన్ మాసం కావ‌డంతో పాత‌బ‌స్తీలో నైట్ బ‌జార్ ప్రారంభ‌మ‌యింది. . ఈ నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలోని నైట్ బజార్ లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కన్పించారు. తన కుమారుడు ఎస్‌ఎస్‌.కార్తికేయతో కలిసి రాజమౌళి అక్కడ రుచికరమైన బిర్యానీని టేస్ట్ చేశారు. ఇక రాజమౌళి అండ్ టీం దగ్గరకెళ్ళి కొంతమంది సెల్ఫీలు అడగ్గా… వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు రాజమౌళి.ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు ఆర్ ఆర్ ఆర్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 1,000 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి అర్ధరాత్రి చార్మినార్ లో సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుకోకుండా ఆ సమయంలో, అలా రాజమౌళి కనిపించే సరికి జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రంజాన్‌ మాసం కావడంతో పాతబస్తీలో నైట్‌ బజార్‌ ప్రారంభమైంది. హైదరాబాదీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు పాతబస్తీ, పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement