Wednesday, March 27, 2024

జగన్ ను నమ్ముకుంటే జైలుకే.. అధికారులకు చంద్రబాబు వార్నింగ్

రాయలసీమ ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భూభాగంపై నీరుపారిస్తే ఇబ్బందులు అని తాను ముందే హెచ్చరించానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని పులిచింతలలో వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే.. సీఎం జగన్‌ ఎందుకు బాధ్యత తీసుకుని కేసీఆర్​తో మాట్లాడట్లేదని ప్రశ్నించారు. నీటిని వృధాగా సముద్రపాలు చేసే అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి నీటి సమస్యే తాను సీఎంగా ఉన్నప్పుడు తలెత్తితే వెంటనే కేసీఆర్ తో మాట్లాడి పరిష్కరించామని గుర్తు చేశారు. రాష్ట్ర హక్కుల్ని కాపాడుకుంటూనే ప్రతి ఎకరాకు నీరివ్వొచ్చన్న చంద్రబాబు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిగెత్తించిన పోలవరాన్ని పడుకోపెట్టారని ఆయన మండిపడ్డారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం మండిపడ్డారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులకు తాము భయపడే పరిస్థితే లేదన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. పోలీసులు కూడా హుందాగా ప్రవర్తిస్తూ పద్ధతి ప్రకారం పని చేయాలన్నారు. ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకు పోయారని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అధికారులను హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఈటల కోసం చివరి వరకు ప్రయత్నించా.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement